Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లు!!

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (15:08 IST)
జపాన్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బుల్లెట్ రైలు. ప్రపంచ వ్యాప్తంగా జపాన్ బుల్లెట్ రైలుకు అంత ప్రజాదారణ ఉంది. బుల్లెట్ రైళ్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న జపాన్.. ఇపుడు డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. వచ్చే 2030 నాటికి జపాన్‌లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 
 
2028 నాటికి ఒక మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవరు సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ కానున్నాయని.. అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్‌లోనే అందుబాటులో ఉంటారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఆ తర్వాత యేడాది నుంచి డ్రైవర్ రహిత రైళ్ల ట్రయల్స్‌ను నిర్వహించి 2030 మధ్య నాటికి టోక్యో - నిగాటా మధ్య జోట్సు మార్గంలో పూర్తిస్థాయి డ్రైవర్ లెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 
 
కార్మికుల కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో ఈ రైళ్లు సహాయపడతాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ దేశంలో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. భవిష్యత్‌లో బుల్లెట్ రైళ్లన్నీ డ్రైవర్ రహితంగా నడిచేలా చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం
Show comments