Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్‌లో డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లు!!

ఠాగూర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (15:08 IST)
జపాన్ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది బుల్లెట్ రైలు. ప్రపంచ వ్యాప్తంగా జపాన్ బుల్లెట్ రైలుకు అంత ప్రజాదారణ ఉంది. బుల్లెట్ రైళ్ల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న జపాన్.. ఇపుడు డ్రైవర్ రహిత బుల్లెట్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. వచ్చే 2030 నాటికి జపాన్‌లో డ్రైవర్లు లేకుండా బుల్లెట్ రైళ్లు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. తూర్పు జపాన్ రైల్వేలో తొలిసారిగా వీటిని ప్రవేశపెట్టనున్నారు. 
 
2028 నాటికి ఒక మార్గంలో నడిచే రైళ్లలో డ్రైవరు సేవలు పూర్తిగా ఆటోమేటెడ్ కానున్నాయని.. అయినప్పటికీ డ్రైవర్లు క్యాబిన్‌లోనే అందుబాటులో ఉంటారని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఆ తర్వాత యేడాది నుంచి డ్రైవర్ రహిత రైళ్ల ట్రయల్స్‌ను నిర్వహించి 2030 మధ్య నాటికి టోక్యో - నిగాటా మధ్య జోట్సు మార్గంలో పూర్తిస్థాయి డ్రైవర్ లెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 
 
కార్మికుల కొరత వంటి సమస్యలను పరిష్కరించడంలో ఈ రైళ్లు సహాయపడతాయని రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. జపాన్ దేశంలో జనాభా క్షీణిస్తుండటంతో ఇప్పటికే అక్కడి అనేక రంగాలు కార్మికుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. భవిష్యత్‌లో బుల్లెట్ రైళ్లన్నీ డ్రైవర్ రహితంగా నడిచేలా చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments