Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న డోనాల్డ్ ట్రంప్!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:41 IST)
అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు నేపథ్యంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్‌ నిషేధానికి దారి తీశాయి.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నది అధ్యక్షుడుగా కాదు.. సామాజిక మాధ్యమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేంటి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం. 
 
అయితే, ట్రంప్‌ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆ కొత్త వేదికగానే ఆయన మళ్లీ నెటిజన్ల ముందుకు రాబోతున్నారని 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.
 
‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తాను సొంతంగా పెట్టబోయే నూతన సామాజిక మాధ్యమ వేదికపైనే ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manoj: నన్నే కాదు నా కుటుంబాన్ని నిలబెట్టి ఆయనే : మంచు మనోజ్

Chaitu: గుండెలను హత్తుకునే బ్యూటీ ట్రైలర్ : నాగ చైతన్య

మైత్రి డిస్ట్రీబ్యూషన్ ద్వారా ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు చిత్రం

Devarakonda: కవాయ్ ఐల్యాండ్స్ వెకేషన్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఇసైఙ్ఞాని ఇళయరాజా మ్యూజికల్ లైవ్ కన్సర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments