Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న డోనాల్డ్ ట్రంప్!

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (11:41 IST)
అమెరికాలో జనవరి 6వ తేదీన క్యాపిటల్‌ భవనంపై అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ దాడి తదనంతర పరిణామాలు నేపథ్యంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర వేదికల నుంచి ట్రంప్‌ నిషేధానికి దారి తీశాయి.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆయన రీఎంట్రీ ఇవ్వనున్నది అధ్యక్షుడుగా కాదు.. సామాజిక మాధ్యమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అదేంటి ట్విటర్‌, ఫేస్‌బుక్‌ సహా ఇతర సోషల్‌ మీడియా వేదికలు ఆయన ఖాతాలను నిషేధించాయి కదా! మళ్లీ ఎలా వస్తారనేగా మీ అనుమానం. 
 
అయితే, ట్రంప్‌ ఈ సారి తనను తొలగించిన వేదికల నుంచి కాకుండా.. తానే స్వయంగా మరో కొత్త సామాజిక మాధ్యమ వేదికను ప్రారంభించనున్నారని సమాచారం. రెండు లేదా మూడు నెలల్లో ఆ నూతన వేదికను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 
 
ఆ కొత్త వేదికగానే ఆయన మళ్లీ నెటిజన్ల ముందుకు రాబోతున్నారని 2020 ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు అధికార ప్రతినిధిగా వ్యవహరించిన జేసన్‌ మిల్లర్‌ మీడియాకు తెలిపారు.
 
‘ట్రంప్‌ మళ్లీ సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టనున్నారు. ఈ సారి ఆయన తాను సొంతంగా పెట్టబోయే నూతన సామాజిక మాధ్యమ వేదికపైనే ప్రజలకు అందుబాటులోకి రానున్నారు’ అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments