Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దు.. అమెరికాకు తేల్చిచెప్పిన భారత్

Webdunia
శనివారం, 3 ఆగస్టు 2019 (07:55 IST)
సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో జరుగుతోంది. గురువారం మొదలైన ఈ సదస్సు.. శుక్రవారం రెండోరోజు కొనసాగింది. సదస్సుకు హాజరైన ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రులు తమ దేశాల మధ్య సంఘీభావానికి సూచికగా చేయిచేయి కలిపి ఫొటోలకు పోజులిచ్చారు.
 
 భారత విదేశాంగ మంత్రి జయశంకర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశం అయ్యారు. కశ్మీర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. కశ్మీర్ సమస్యను భారత్ – పాకిస్థాన్ రెండు దేశాలు కలిసి చర్చించుకుని పరిష్కరించుకుంటాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ.. మరే దేశం జోక్యం కానీ అవసరం లేదని జయశంకర్ మైకేల్ పాంపియోకు క్లియర్ గా చెప్పారు.
 
 పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్ తన కామెంట్స్ తో సంచలనం రేపారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ చేయాలని భారత ప్రధాని, పాక్ ప్రధాని తనను అడిగారని ట్రంప్ చెప్పడంపై పెద్ద దుమారం రేగింది. ట్రంప్ మాట్లాడిన తర్వాత.. భారత్, పాక్ దేశాలు మొట్టమొదటగా చర్చించుకున్నది బ్యాంకాక్ లోని ఆసియాన్ సదస్సులోనే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లోనే… కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ తోనే తేల్చుకుంటామని.. అమెరికాకు తేల్చిచెప్పింది ఇండియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments