Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈస్టర్ డే పేలుళ్ళ కవరేజీకి వెళ్లిన భారతీయ జర్నలిస్టు... అరెస్టు చేసిన శ్రీలంక

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (13:08 IST)
శ్రీలంక రాజధాని కొలంబోలో గత ఏప్రిల్ నెల 21వ తేదీన ఈస్టర్ సండే రోజున వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో సుమారుగా 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్ళను యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. అయితే, ఈ పేలుళ్ళను లైవ్ కవరేజ్ చేసేందుకు భారత్ నుంచి ఫోటో జర్నలిస్టు సిద్ధిఖీ అహ్మద్ డానిష్ కొలంబోకు వెళ్లాడు. ఆయన్ను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ముందస్తు అనుమతిలేకుండా ఓ స్కూల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినందునే ఆయనను అరెస్టు చేసినట్టు సమాచారం. నెగొంబో నగరంలోని ఓ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు సిద్దిఖి బలవంతంగా లోపలికి వెళ్లబోయినట్టు శ్రీలంక స్థానిక మీడియా వెల్లడించింది. ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్ధి చనిపోయాడనీ.. అతడి గురించి వివరాలు తెలుసుకునేందుకు సిద్దిఖి లోపలికి వెళ్లబోయారని తెలిపింది.
 
అయితే అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 'అనుమతి లేకుండా చొరబాటుకు ప్రయత్నించిన అభియోగాలపై ఆయన అరెస్ట్ అయ్యారు. అనంతరం ఈ నెల 15 వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారు' అని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments