Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండో - పాక్ నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు ఆందోళనకరం : బాన్ కీ మూన్

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ నియంత్రణ రేళ వద్ద పరిస్థితులు భయంకరంగా, ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. యూరీ ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ దే

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (13:21 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ నియంత్రణ రేళ వద్ద పరిస్థితులు భయంకరంగా, ఆందోళన కలిగించేలా ఉన్నాయని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ అన్నారు. యూరీ ఉగ్రదాడి తర్వాత ఇండోపాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ ఇరు దేశాల వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరింత నష్టం జరగకముందే దీనిపై సామరస్యంగా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలన్నారు.
 
'పరిస్థితి మరింత విషమించి ప్రాణనష్టానికి దారితీయకముందే భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు ముందుకు వచ్చి దీని గురించి చర్చించి శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తాయని నేను నమ్ముతున్నాను. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ప్రయత్నించే వారి పక్షంలో ఐక్యరాజ్యసమితి నిలుస్తుంది' అని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments