Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుఫాను విధ్వంసం - 208 మంది మృతి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (07:31 IST)
ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఆ దేశంలో అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. ఈ తుఫాను వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మందివరకు గాయపడ్డారు. 52 మంది గల్లంతు అయ్యారు. ఇటీవలి కాలంలో ఈ దేశంలో తుఫాను ధాటికి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్చిపెలాగోలేని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది ఈ తుఫాను వల్ల గాయపడ్డారు. మరో 52 మంది గల్లంతయ్యారు. కోస్తా ప్రాంతమంతా తుఫానుధాటికి తుడిచిపెట్టుకుని పోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. 
 
అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ తుఫాను వల్ల నిరాశ్రయులైన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments