రెండేళ్ల చిన్నారి.. మొసళ్ల గుంపుకు చిక్కింది.. పుర్రె మాత్రమే మిగిలింది..

Webdunia
బుధవారం, 3 జులై 2019 (16:33 IST)
కాంబోడియాలో మొసళ్ల గుంపుకు మధ్యలో రెండేళ్ల చిన్నారి చిక్కుకుంది. చివరికి మొసళ్ల నోటికి చిక్కుకున్న రెండేళ్ల చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది. ఈ ఘటన స్థానికంగా ప్రజలను భయభ్రాంతులను చేసింది. వివరాల్లోకి వెళితే.. కాంబోడియాలో సియమ్ రియాయ్ అనే ప్రాంతంలో మొసళ్ల ఫామ్ వుంది. ఈ మొసళ్ల ఫామ్‌ను 35 ఏళ్ల మిన్ మిన్ నిర్వహిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొసళ్లను మాత్రమే వదిలిపెట్టి.. ఫామ్‌కు సంబంధించిన పనుల కోసం బయటికి వెళ్లాడు. మిన్ మిన్‌ తొలి సంతానం రెండేళ్ల చిన్నారి రోమ్ రాథ్ బయట ఆడుకుంటూ వున్నది. ఆతని భార్య అప్పుడే రెండో బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె ఆ పాపాయిని చూస్తూ.. ఆడుకుంటూ వున్న తొలి బిడ్డను పెద్దగా పట్టించుకోలేదు. 
 
కానీ రోమ్ రాథ్ కాలు జారి మొసళ్ల ఫామ్‌లో పడటంతో మొసళ్లు ఆ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి. చివరికి రోమ్ రాథ్‌ను వెతుక్కుంటూ వచ్చిన ఆమె తండ్రికి.. మొసళ్ల బృందంలో రోమ్ రాథ్ పుర్రె మాత్రం కనిపించింది. దీంతో షాక్ తిన్న మిన్ మిన్ బోరున విలపించాడు. ఇంట్లోనే ఆడుకుంటూ వుంది కదానుకున్న రోమ్ రాథ్ తల్లి మొసళ్లు తన బిడ్డను పొట్టను బెట్టుకున్న విషయం తెలుసుకుని రోదించింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments