Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన భర్త.. తర్వాత... ఏమైంది...

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (21:59 IST)
అలిగిన భార్యను సంతృప్తి పరిచేందుకు కట్టుకున్న భర్త చేసిన ఓ పనికి ఇపుడు ఆ దంపతులు కోటీశ్వరులయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి చేసిన పనేంటో తెలుసా? భార్యను సంతృప్తి పరిచేందుకు రెండు లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేయడమే. ఈ ఆసక్తికర సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ నగరంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ నగరానికి చెందిన ఓ జంట గత మూడు దశాబ్దాలుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇటీవల తన పేరుమీద లాటరీ టిక్కెట్‌‍ను భర్త కొనుగోలు చేయడం మరిచిపోయాడు. దీంతో ఆమె భర్తపై అలిగింది. ఆమె అలకను తీర్చేందుకు ఆ వ్యక్తి తన భార్య పేరు మీద రెండు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ఈ లాటరీ టిక్కెట్ల ఫలితాలు గత సోమవారం వెలువడ్డాయి. 
 
ఇందులో ఈ రెండు లాటరీ టిక్కెట్లకు డ్రా తగిలింది. ఒకటి కాదు రెండు కాదు.. ఒక్కో టిక్కెట్‌కు ఏకంగా రూ.8 కోట్లు చొప్పున కలిపి మొత్తం 16 కోట్లు వచ్చిపడ్డాయి. దాంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ డబ్బుతో తమ కుమార్తెకు కొత్త ఇల్లు కొనిస్తామని, తమ పిల్లల కోసమే కాకుండా వారి పిల్లల కోసం కూడా లాటరీ సొమ్మును వినియోగిస్తామని ఆ దంపతులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments