Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 13,915.. యూఏఈలో ఎన్నారైలకు?

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (11:10 IST)
ఇటలీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,877కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి 53,218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇటలీలో అత్యధికంగా 13,915 మంది మరణించగా, 1,15,242ల పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. స్పెయిన్‌లో 10,348 మంది, అమెరికాలో 6,088 మంది ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందారు.
 
జర్మనీలో మృతుల సంఖ్య 1,107, ఫ్రాన్స్‌లో 5,387 మంది ప్రాణాలు కోల్పోయారు.  ప్రపంచ దేశాలు కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నాయి. అగ్రరాజ్యాలను సైతం ఈ వైరస్‌ గడగడలాడిస్తోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ తన ఉనికి చాటుకున్న ఈ మహమ్మారి అక్కడ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 
 
ఇక యూఏఈలో కొవిడ్‌-19 విజృంభణతో గురువారం ఒక్కరోజే 210 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1024కి చేరాయి. తాజాగా నమోదైన కొత్త కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ప్రవాసులు ఉన్నారని యూఏఈ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిని ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నామని, కోలుకుంటున్నట్లు యూఏఈ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments