Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌తో మేలు జరిగిందా? ఎలా?

Webdunia
ఆదివారం, 1 మార్చి 2020 (16:51 IST)
కరోనా వైరస్ కారణంగా చైనాకు చుక్కలు కనిపించాయి. కరోనా ప్రభావంతో జనాలు ఇళ్లలోంచి బయటికి రావడమే మానేశారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి పారిశ్రామిక రంగం కుంటుపడింది. ఇది చైనా ఆర్థికవృద్ధిని కుంగదీసినప్పటికీ.. వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. తాజాగా నాసా వాయు కాలుష్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.  
 
ఈ ఫోటోలు వాయు కాలుష్యానికి కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్‌కి సంబంధించింది. మోటార్ వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కర్మాగారాలు ఈ గ్యాస్‌ను అధికమొత్తంలో విడుదల చేస్తుంటాయి. ఈ చిత్రాల ప్రకారం.. జనవరి మధ్య చైనా దేశ వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణం అధిక స్థాయిలో ఉండగా.. ఫిబ్రవరి నెలలో దీనిస్థాయి భారీగా తగ్గిపోయింది. 
 
వైరస్ కేంద్రమైన వూహాన్ నగరంలో తొలుత నైట్రోజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభించాయి. ఆ తరువాత.. ఆర్థిక రంగం నెమ్మదించే కొద్ది.. బీజింగ్, షాంఘాయ్ వంటి నగరాల్లోనూ వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా వాయు కాలుష్యం ఈ స్థాయికి తగ్గుతుందని తాను భావించట్లేదని నాసా పరిశోధకులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments