Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వైరస్ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న చైనీయులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (12:05 IST)
చైనాలో ప్రాణాంతక వైరస్ కరోనా దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో చైనీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది. 
 
అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. బుధవారం వరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు ఉంటే, ఇవాళ్టికి ఏడు వేలు దాటింది. వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొమ్మిదివేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది. 
 
అలాగే, విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈ వైరస్‌ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల మందికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments