Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాంతక వైరస్ దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్న చైనీయులు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (12:05 IST)
చైనాలో ప్రాణాంతక వైరస్ కరోనా దడ పుట్టిస్తోంది. ఈ వైరస్ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీంతో చైనీయులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బుధవారం వరకు 132 మంది ఈ వ్యాధికి బలైతే, తాజాగా ఆ సంఖ్య 170కి చేరింది. 
 
అదేవిధంగా వ్యాధిగ్రస్తులు కూడా అంతకంతకు పెరుతున్నారు. బుధవారం వరకు వ్యాధిగ్రస్తుల సంఖ్య ఆరు వేలు ఉంటే, ఇవాళ్టికి ఏడు వేలు దాటింది. వారిలో దాదాపు 1300 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తొమ్మిదివేలకు పైగా వ్యాధిగ్రస్తుల్లో 103 మంది కోలుకున్నట్లు చైనా అధికారికంగా తెలియజేసింది. 
 
అలాగే, విదేశీ పౌరులు ఎవరైనా తమ దేశాలకు వెళ్లాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని చైనా ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఈ వైరస్‌ 30 దేశాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా ఎనిమిది వేల మందికి ఈ వైరస్ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments