Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మందు హనుమంతుడు తెచ్చిన సంజీవిని లాంటిది.. మాకూ ఇవ్వండి...

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (20:51 IST)
కరోనా వైరస్ ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ... ప్రపంచ దేశాలకు భారత్ పెద్దదిక్కుగా మారింది. ఈ కరోనా వైరస్ సోకిన వారికి కొంతమేరకు ఉపశమనం కలిగించే మందు భారత్ వద్ద పుష్కలంగా ఉండటంతో అన్ని దేశాల అధినేతలు భారత్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఈ దేశాల్లో చివరకు ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా కూడా ఆ మందు కోసం భారత్‌ను ఆశ్రయించింది. 
 
ఈ పరిస్థితుల్లో తాజాగా బ్రెజిల్ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో హనుమజయంతి రోజున ఓ లేఖ రాశారు. 
 
ఈ లేఖలో రామాయ‌ణ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ల‌క్ష్మ‌ణుడిని కాపాడేందుకు హిమాల‌యాల నుంచి హ‌నుమంతుడు సంజీవిని తీసుకువ‌చ్చార‌న్నార‌న్నారు. 
 
అలాగే పేద‌ల‌ను కాపాడేందుకు జీసెస్ కూడా ఎన్నో మ‌హిమ‌లు ప్ర‌ద‌ర్శించి రోగాల‌ను పార‌ద్రోలార‌ని, ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఇచ్చి మ‌మ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్స‌నారో బుధవారం మోడీకి లేఖ రాశారు. 
 
ఈ సందర్భంగా బ్రెజిల్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంమీద మందులేని కరోనా వైరస్‌కు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న హైడ్రాక్లీక్లోరోక్వీన్ ఓ దివ్యౌషధంగా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments