Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

Webdunia
ఆదివారం, 2 ఫిబ్రవరి 2020 (17:39 IST)
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న చైనాలోని వూహాన్ ప్రాంతంలో అన్నెం శృతి అనే యువతి చిక్కుకునిపోయింది. ఈ యువతి కర్నూలు జిల్లాకు చెందిన యువతి కావడం గమనార్హం. ఈ యువతి టీసీఎల్ కంపెనీలో పనిచేస్తూ వస్తోంది. శిక్షణ నిమిత్తం గత ఏడాది ఆగస్టులో తిరుపతి నుంచి 60 మంది ఉద్యోగులతో కలసి చైనా వెళ్లింది. 
 
అయితే, చైనాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ ఉన్న భారతీయులందరినీ కేంద్రం స్వదేశానికి రప్పిస్తోంది. ఇందుకోసం రెండు ప్రత్యేక విమానాలు నడిపింది. అయితే, అన్నెం శృతిని మాత్రం విమానం ఎక్కనివ్వలేదు. దీనికి కారణం ఆ యువతినికి 90 డిగ్రీల జ్వరం ఉండటంతో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా దించేశారు. 
 
తనతో పాటు మిగిలిన ఇద్దరు చెరో చోట చిక్కుకుని ఉండిపోయామని.. తిండి మందులు ఏమి ఇవ్వడం లేదని కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం  బీజనవేములలో ఉంటున్న తల్లిదండ్రులకు వాట్సాప్ వీడియో ద్వారా సమాచారం చేరవేసింది. 
 
శృతికి ఈనెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో వివాహంనిశ్చయం అయింది. 
పెళ్లి దగ్గర పడుతున్న తరుణంలో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments