Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్.. ప్రియురాలిని చంపేసిన ప్రియుడు.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (15:56 IST)
కరోనా వైరస్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. కరోనాకు దూరంగా వుండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా తనకు కరోనా అంటిందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 
 
లారెనా డాక్టర్. ఆంటోనియా మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. చెలి సేవలను గతవారం కొనియాడాడు ఆంటోనియా. కానీ ఆ తర్వాత స్వల్పంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు.
 
ఇంచుమించు కరోనా లక్షణాలే కనిపించడంతో.. లారెన్ వల్లనే అని అనుమానం పెంచుకున్నాడు. ఆమె ద్వారానే తనకు కరోనా సోకిందని భావించి.. బుధవారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు. 
 
పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. లారెన్, ఆంటోనియాల్లో ఎవరికీ కరోనా లేని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments