Webdunia - Bharat's app for daily news and videos

Install App

లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు సిద్ధం - చైనా ప్రకటన

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (16:01 IST)
Ladakh
కరోనా మహమ్మారి చైనాలో పుట్టడంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై గుర్రుగా వున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-చైనాల మధ్య వున్న లడఖ్ సమస్యను పరిష్కరించేందుకు డ్రాగన్ కంట్రీ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు భారత్-చైనా మధ్య నెలకొన్న లడఖ్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని శుక్రవారం చైనా ప్రకటించింది. 
 
సరిహద్దు సమస్యలపై శనివారం జరగనున్న మిలటరీ స్థాయి అధికారుల సమావేశానికి ఒక రోజు ముందు చైనా ఈ ప్రకటనను వెలువరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతానికైతే భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా, అదుపులోనే వుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ తెలిపారు. 
 
సైన్యం, దౌత్యపరమైన మాధ్యమాలున్నప్పటికీ...తాము ఎప్పటిలాగానే సమాచారాన్ని చేరవేస్తున్నామని చెప్పారు. అలాగే సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు తాము చిత్తశుద్ధితో కట్టుబడి వున్నామని తెలిపారు.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments