Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలంబియాలో తుపాను బీభత్సం... ఎటు చూసినా శవాల గుట్టలే

కొలంబియాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 254 మంది మృత్యువాతపడ్డారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 400 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. ఈ తుపాను ధాటికి కొలంబియాలోన

Webdunia
ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (16:32 IST)
కొలంబియాలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా ఇప్పటివరకు 254 మంది మృత్యువాతపడ్డారు. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 400 మంది గాయపడ్డారు. మరో 200 మంది గల్లంతయ్యారు. ఈ తుపాను ధాటికి కొలంబియాలోని మొకొవా నగరం పూర్తిగా మునిగిపోయింది. 
 
పుటుమాయో ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగి భవనాలపై పడ్డాయి. వాహనాలన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. మొకొవాలోని 345,000 మంది జనాభాని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కొలంబియా అధ్యక్షుడు జువాన్‌ మాన్యుల్‌ అధికారులను ఆదేశించారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. దాదాపు 1,100 మంది జవాన్లు గల్లంతైనవారి కోసం గాలింపులు చర్యలు చేపడుతున్నారు. మొకావో మేయర్‌ జోస్‌ అంటోనియో కూడా ఇల్లు కోల్పోయారు.
 
క్షతగాత్రుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైద్యులు రాత్రి పగలు అనే తేడాలేకుండా వైద్యం చేస్తూనే ఉన్నారు. చాలా మందికి రక్తం ఎక్కించాల్సి ఉంది కానీ ఆస్పత్రిలో బ్లడ్‌ బ్యాంక్‌ లేకపోవడంతో చాలా మందికి వైద్యం ఆలస్యమవుతోంది. కాగా, కొలంబియాలో 1985లో వచ్చిన తుపాను బీభత్సం మర్చిపోలేనిది. అప్పట్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 20,000 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments