Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా సైనికులను పరుగుపెట్టించిన ఇండియన్ ఆర్మీ

డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దునుదాటి చైనా బలగాలు కిలోమీటరు దూరం మేరకు చొచ్చుకొచ్చాయి.

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (10:02 IST)
డ్రాగన్ జవాన్లకు భారత ఆర్మీ సరైన గుణపాఠం చెప్పింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దునుదాటి చైనా బలగాలు కిలోమీటరు దూరం మేరకు చొచ్చుకొచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన భారత బలగాలు చైనా బలగాలను అడ్డుకున్నాయి. భారత్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో డ్రాగన్ సైనికులు తోకముడిచి పరుగులు తీశారు. 
 
ఈ ఘటన డిసెంబర్ చివరివారంలో అప్పర్ సయాంగ్ జిల్లాలో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి కిలోమీటరు దూరం వరకు చైనా బలగాలు చొచ్చుకువచ్చాయి. ట్యూటింగ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. 
 
ఈనేపథ్యంలో తాము అరుణాచల్ ప్రదేశ్‌ను అసలు గుర్తించడమే లేదని, అలాంటప్పుడు తమది చొరబాటు ఎలా అవుతుందని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గెంగ్‌షువాంగ్ వితండవాదనకు దిగారు. అయితే భారత సైన్యం బుధవారం ట్యూటింగ్ ప్రాంతానికి వెళ్లి నిర్మాణ సామగ్రిని సీజ్ చేసింది. దీంతో చైనా బృందాలు వెనక్కి వెళ్లిపోయాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments