Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీరుమార్చుకోని చైనా.. మళ్లీ సరిహద్దుల వద్దకు పీపుల్స్ ఆర్మీ

Webdunia
బుధవారం, 19 మే 2021 (13:30 IST)
చైనా తీరు ఏమాత్రం మారడం లేదు. భారత్‌తో కయ్యానికి నిత్యం కాలుదువ్వుతూ ఉంది. తాజాగా భారత సరిహద్దుల వద్దకు మళ్లీ సైనిక బలగాలను భారీగా తరలించింది. స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు మ‌ళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది. 
 
ఓవైపు భార‌త్‌ క‌రోనాతో అల్లాడిపోతోన్న స‌మ‌యంలో చైనా ఈ తీరును ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. తూర్పు ల‌ఢ‌ఖ్ సెక్టార్‌కు స‌మీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండ‌డాన్ని భార‌త్ గుర్తించింది. 
 
చైనా సైన్యం తీరును నిశితంగా ప‌రిశీలిస్తోంది. స‌రిహ‌ద్దుల మీదుగా కొన్ని గంట‌ల్లోనే భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.
 
అంతేగాక‌, ఆయా ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల‌ను చైనా అభివృద్ధి ప‌రుచుకుంటోంది. గ‌త ఏడాది ఇదే స‌మ‌యంలో చైనా-భార‌త్ సైన్యాలు తూర్పు ల‌ఢ‌ఖ్ ప్రాంతంలో భారీగా మోహ‌రించిన విష‌యం తెలిసిందే. అనేక ద‌శల చ‌ర్చ‌ల అనంత‌రం ఇరు దేశాల సైనికులు వెన‌క్కి వెళ్లారు. అయితే, చైనా మ‌ళ్లీ త‌న బుద్ధిని చూపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
 
గతంలో కూడా భారత్ - చైనా దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా, ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 22 మంది వరకు మృత్యువాతపడితే పీపుల్స్ ఆర్మీ వైపున 30 మంది వరకు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments