Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్ట్‌కు చేరిన చైనా వ్యాక్సిన్‌

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:29 IST)
చైనా ఔషధ దిగ్గజం సీనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా తొలి షిప్‌మెంట్‌ ఈజిప్ట్‌ చేరింది. ఈజిప్ట్‌ మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి ప్రత్యేక విమానంలో దీన్ని రవాణా చేశారు.

ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రి హలా జాయెద్‌, చైనా-యూఏఈ రాయబారులు కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానానికి స్వాగతం పలికారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సిబ్బందికి ముందుగా టీకా అందిస్తామని ఆరోగ్యశాఖ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో సుమారు 1.20 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 6,832 మంది మరణించారు.

పది దేశాల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాకముందే... టీకా అత్యవసర వినియోగానికి పలు దేశాలు ఆమోదం తెలిపాయి.

యూఏఈలో నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 86% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments