Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈజిప్ట్‌కు చేరిన చైనా వ్యాక్సిన్‌

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:29 IST)
చైనా ఔషధ దిగ్గజం సీనోఫార్మ్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా తొలి షిప్‌మెంట్‌ ఈజిప్ట్‌ చేరింది. ఈజిప్ట్‌ మిత్రదేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి ప్రత్యేక విమానంలో దీన్ని రవాణా చేశారు.

ఈజిప్ట్‌ ఆరోగ్య మంత్రి హలా జాయెద్‌, చైనా-యూఏఈ రాయబారులు కైరో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానానికి స్వాగతం పలికారు.

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సిబ్బందికి ముందుగా టీకా అందిస్తామని ఆరోగ్యశాఖ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటివరకూ ఈజిప్ట్‌లో సుమారు 1.20 లక్షల కొవిడ్‌ కేసులు నమోదు కాగా, 6,832 మంది మరణించారు.

పది దేశాల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తికాకముందే... టీకా అత్యవసర వినియోగానికి పలు దేశాలు ఆమోదం తెలిపాయి.

యూఏఈలో నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల్లో సీనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ 86% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిపుణులు గుర్తించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments