Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస మంగాపురంలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (07:26 IST)
తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం వద్ద 49 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు.  ఆర్ ఎస్ ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ భాకరాపేట అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారని తెలిపారు.

రాత్రి కొంతమంది ఎర్రచందనం దుంగలను మోసుకుంటూ శ్రీనివాస మంగాపురం వద్ద దుంగలతో రోడ్డు దాటుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అడ్డుకున్నారు.  స్మగ్లర్లు దుంగలను పడేసి దట్టమైన మంచు, పొదల్లో కలసి పోయినట్లు తెలిపారు. పొదల మధ్య వారికోసం తమ సిబ్బంది గాలిస్తున్నట్లు చెప్పారు.

సంఘటన స్థలానికి డీఎస్పీ లు వెంకటయ్య, గిరిధర్, సిఐలు చంద్రశేఖర్, వెంకటరవి ఎఫ్ ఆర్వో లు ప్రసాద్, నటరాజ తదితరులు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. టాస్క్ పోలీసు స్టేషన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments