Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:47 IST)
చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగె-5 క్షేమంగా భూమిని చేరింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇన్నర్‌ మంగోలియాలో ప్యారాశ్చూట్‌ సహాయంతో క్యాప్సూల్‌ భూమిని తాకింది. గురువారం వేకువ జామున పరిశోధనా సిబ్బంది క్యాప్యూల్స్‌ను రికవరీ చేసుకున్నారు. ఈ నెల 1న చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చాంగె-5 రెండు మీటర్ల వరకు తవ్వి సుమారు రెండు కిలోల నమూనాలను సేకరించింది.
 
చందుడ్రిపై మట్టి నమూనాలు తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1976లో సోవియట్ యూనియన్ పంపించిన లూనా 24 తర్వాత భూమి పైకి చంద్రుడి నమూనాలను మోసుకువచ్చింది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్‌లో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments