Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలు తెచ్చిన చైనా వ్యోమనౌక

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (10:47 IST)
చంద్రుడిపై మట్టి, రాతి నమూనాలతో చైనా వ్యోమనౌక చాంగె-5 క్షేమంగా భూమిని చేరింది. బుధవారం అర్థరాత్రి తర్వాత ఇన్నర్‌ మంగోలియాలో ప్యారాశ్చూట్‌ సహాయంతో క్యాప్సూల్‌ భూమిని తాకింది. గురువారం వేకువ జామున పరిశోధనా సిబ్బంది క్యాప్యూల్స్‌ను రికవరీ చేసుకున్నారు. ఈ నెల 1న చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చాంగె-5 రెండు మీటర్ల వరకు తవ్వి సుమారు రెండు కిలోల నమూనాలను సేకరించింది.
 
చందుడ్రిపై మట్టి నమూనాలు తీసుకురావడం గత నాలుగు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. 1976లో సోవియట్ యూనియన్ పంపించిన లూనా 24 తర్వాత భూమి పైకి చంద్రుడి నమూనాలను మోసుకువచ్చింది. ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్‌లో చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై వాతావరణ పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేసే వీలు కలుగనుంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments