Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా ప్రళయం - ఒకే రోజు 3.7 కోట్ల పాజిటివ్ కేసులు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (10:10 IST)
డ్రాగన్ కంట్రీ (చైనా)లో కరోనా వైరస్ ప్రళయం సృష్టిస్తుంది. ఇందుకు నిదర్శనమే ఒకే రోజు ఏకంగా 3.7 కోట్ల పాజిటివ్ కేసులు నమోదుకావడం. గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కనీవినీ ఎరుగని రీతిలో నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో డ్రాగన్ కంట్రీ పాలకలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 
 
డిసెంబరు తొలి 30 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. ఇది చైనా జనాభాలో 18 శాతం. అలాగే, ఈ వారంలో ఒకే రోజున  గత 24 గంటల్లోనే ఏకంగా 3.7 కోట్లమంది కరోనా పాజిటివ్ బాధితులుగా మారారు. చైనాలో ఇంతకుముందు ఒకే రోజున నమోదైన అత్యధిక కేసులు 40 లక్షలు కాగా, ఇపుడు ఈ సంఖ్యను మించిందిపోయింది.
 
ఇపుడు ఏకంగా దాదాపుగా 4 కోట్ల కేసులు నమోదుకావడం చైనాలో కలకలం రేపుతోంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో ఇంత స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవు. ఈ కేసుల సంఖ్యను చూస్తే చైనాలో కరోనా వైరస్ తీవ్ర ఏ స్థాయిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. అదేసమయంలో డ్రాగన్ పాలకులు మాత్రం కరోనా మరణాలపై మాత్రం నోరు విప్పడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments