Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా నుంచి వచ్చే విమానాలను ఆపండి.. భారతీయుల విజ్ఞప్తి

coronavirus
, బుధవారం, 21 డిశెంబరు 2022 (14:48 IST)
కోవిడ్ విజృంభిస్తున్నందున చైనా నుండి వచ్చే అన్ని విమానాలను ప్రభుత్వం బంద్ చేయాలని 10 మంది భారతీయులలో 7 మంది కోరుకుంటున్నారు. చైనాలో ఆకస్మిక కోవిడ్ ఉప్పెన మహమ్మారి భయాలను తిరిగి తెచ్చినందున, బుధవారం 10 మంది భారతీయులలో 7 మంది చైనా నుండి వచ్చే అన్ని విమానాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
చైనాలో ఉన్న ఎవరికైనా భారత్ లోకి ప్రవేశాన్ని.. ప్రభుత్వం నిషేధించాలని అన్నారు. ప్రస్తుతం చైనా ప్రధాన భూభాగం నుండి భారతదేశానికి విమానాలు ఇతర దేశాల గుండా వెళుతుండగా, హాంకాంగ్ నుండి భారతదేశానికి నేరుగా విమానాలు నడుస్తున్నాయి. కోవిడ్ వైరస్, దాని సబ్ వేరియంట్ BF.7 ద్వారా తిరిగి వచ్చింది. ప్రస్తుతం చైనాలో వినాశనం కలిగిస్తోంది.
 
ఈ నేపథ్యంలో సోషల్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 71 శాతం మంది పౌరులు భారతదేశం చైనా నుండి విమానాలను నిలిపివేయాలని.. అలాగే గత 14 రోజుల్లో చైనా నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్ లో వుంచాలని కోరుతున్నట్లు తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజగోపాల్ అన్నా తొందరపడకు.. మాటజారకు...: ఎమ్మెల్సీ కవిత కౌంటర్