Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్కా ప్లాన్‌తో డ్రాగన్ దాడి ... నదిలోకి దిగగానే నీటిని వదిలి.. ఇనుప లాఠీలతో దాడి...

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (08:52 IST)
భారత్ - చైనా దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. ఒకవైపు చైనా స్నేహాస్తం అందిస్తూనే, మరోవైపు కుట్రలకు పాల్పడుతోంది. దీనికి నిదర్శనమే లడఖ్‌లోని గాల్వాన్ నదిలో భారత సైనికులపై దాడికి పాల్పడింది. ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడిని డ్రాగన్ కంట్రీ పక్కా ప్లాన్ ప్రకారం చేసిందని ప్రభుత్వ సీనియర్ అధికారులు చెబుతున్నారు. 
 
లడఖ్‌లో భారత దళాలను దొంగ దెబ్బ తీయడానికి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) కనీసం రెండు రోజుల ముందే వ్యూహం రచించి ఉండొచ్చని పేర్కొంది. గల్వాన్‌ నదీ ప్రవాహానికి అడ్డుగా రాళ్లు పెట్టడం, భారత సైనికులు వచ్చిన వెంటనే వాటిని తొలగించి ప్రవాహ ఉధృతి పెరిగేలా చేయడం వంటి ఎత్తుగడలకు చైనా సైనికులు పాల్పడివుండొచ్చని పేర్కొంది.
 
'ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతి.. భారత సైనికులు బ్యాలెన్స్‌ కోల్పోయేలా చేసింది. అదే సమయంలో చైనా సైనికులు మనవాళ్లపై దాడికి దిగారు. తోసేశారు. దాంతో భారత సైనికులు గల్వాన్‌ నదిలో పడిపోయారు' అని ఆ అధికారి వివరించారు. 
 
యూఏవీ(అన్‌మ్యాన్‌డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌) ద్వారా భారత సైనికులు ఎంత మంది ఉన్నారనేది వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కి ఆవల నుంచే ధ్రువపరుచుకున్నారని పేర్కొన్నారు. చైనా సైనికులు హెల్మెట్లు, ఇతర రక్షణ పరికరాలు ధరించారని, మేకులున్న రాడ్‌లతో దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments