Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిహద్దుల్లో చైనా బుల్లెట్ రైలు : భారత్ ఏం చేస్తుందో?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (16:10 IST)
డ్రాగన్ కంట్రీ చైనా సరిహద్దుల్లో బుల్లెట్ రైలును ప్రారంభించింది. సరిహద్దుల్లో ఇప్పటికే బలగాలను మోహరిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా.. ఇప్పుడు చైనా ఇండో సరిహద్దుల వెంబడి ఈ బుల్లెట్ రైలును నడిపి మరింత రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉండే టిబెట్‌లోని లాసా - న్యింగ్చి ప్రావిన్సులకు శుక్రవారం ఈ బుల్లెట్ రైలును ప్రారంభించింది. జులై ఒకటో తేదీన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిచువాన్ - టిబెట్ రైల్వేలో భాగమైన 433.5 కిలోమీటర్ల లాసా - న్యింగ్చి సెక్షన్‌ను ప్రారంభించింది.
 
ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే రైలు అని షిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే టిబెట్లో ఖింగాయ్ - టిబెట్ రైల్వే లైన్‌ను ప్రారంభించిన చైనా.. తాజాగా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్‌కు అతి సమీపంలో సిచువాన్ - టిబెట్ రైల్వే మార్గాన్ని నిర్వహణలోకి తెచ్చింది. సరిహద్దు స్థిరత్వానికి దోహదం చేసే ఈ రైల్వే లైన్‌ను వేగంగా పూర్తి చేయాలని గత ఏడాది నవంబర్‌లోనే చైనా ఆదేశించింది. 
 
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డూలో ప్రయాణం మొదలుపెట్టే ఈ రైలు.. యాన్, టిబెట్ లోని ఖామ్డో మీదుగా లాసాకు చేరుకుంటుంది. ఈ రైలుతో చెంగ్డూ నుంచి లాసా - న్యింగ్చికి 48 గంటల ప్రయాణం కాస్తా 13 గంటలకు తగ్గనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments