Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 ఏళ్ల పాటు కడుపు ఉబ్బరం.. కారణం.. కిలోల కొద్ది పేరుకుపోయిన..?

కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడు

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:33 IST)
కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడుపు ఉబ్బరం నుంచి అతనికి విముక్తి లభించింది. 
 
ఇన్ని సంవత్సరాల పాటు కడుపు ఉబ్బరానికి కారణం పెద్ద పేగులో కిలోల కొద్ది పేరుకుపోయిన మలమేనని వైద్యులు తెలిపారు. అరుదుగా సంక్రమించే ఈ వ్యాధిని 'హిర్ష్‌ప్రంగ్'గా పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. మూడు గంటల పాటు శ్రమించి పెద్ద పేగు నుంచి పేరుకుపోయిన మలం కణితిని తొలగించామన్నారు.
 
ఏకంగా 13కేజీల మలాన్ని అతని ఉదరం నుంచి తొలగించినట్లు షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నాడని.. పెద్ద పేగులో లోపాలు ఉండటం వల్ల పుట్టినప్పటి నుంచి అతను మలవిసర్జన చేయలేకపోయాడని వైద్యులు తెలిపారు. తొమ్మిది నెలల గర్భాన్ని పోలిన కడుపుతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని వైద్యులు చెప్పారు. అతని కడుపు నుంచి తొలగించిన కణితి 30 అంగుళాలున్నదని వైద్యులు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments