Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 ఏళ్ల పాటు కడుపు ఉబ్బరం.. కారణం.. కిలోల కొద్ది పేరుకుపోయిన..?

కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడు

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (16:33 IST)
కడుపు ఉబ్బరంగా ఉంటే భరించలేం. అలాంటిది ఓ వ్యక్తి పుట్టిననాటి నుంచి 22 ఏళ్ల వరకు కడుపు ఉబ్బరంతో బాధపడుతూ నరకం అనుభవించాడు. చైనాకు చెందిన 22ఏళ్ల వ్యక్తికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. దీంతో ఇటీవలే కడుపు ఉబ్బరం నుంచి అతనికి విముక్తి లభించింది. 
 
ఇన్ని సంవత్సరాల పాటు కడుపు ఉబ్బరానికి కారణం పెద్ద పేగులో కిలోల కొద్ది పేరుకుపోయిన మలమేనని వైద్యులు తెలిపారు. అరుదుగా సంక్రమించే ఈ వ్యాధిని 'హిర్ష్‌ప్రంగ్'గా పిలుస్తారని వైద్యులు వెల్లడించారు. మూడు గంటల పాటు శ్రమించి పెద్ద పేగు నుంచి పేరుకుపోయిన మలం కణితిని తొలగించామన్నారు.
 
ఏకంగా 13కేజీల మలాన్ని అతని ఉదరం నుంచి తొలగించినట్లు షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో బాధపడుతున్నాడని.. పెద్ద పేగులో లోపాలు ఉండటం వల్ల పుట్టినప్పటి నుంచి అతను మలవిసర్జన చేయలేకపోయాడని వైద్యులు తెలిపారు. తొమ్మిది నెలల గర్భాన్ని పోలిన కడుపుతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడని వైద్యులు చెప్పారు. అతని కడుపు నుంచి తొలగించిన కణితి 30 అంగుళాలున్నదని వైద్యులు చెప్పారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments