Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుణాచల్ ప్రదేశ్ కావాలంటోన్న చైనా! 30 వేల వరల్డ్ మ్యాచ్‌లను తగలబెట్టేసింది...

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (17:02 IST)
దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ తమదేననీ... సౌత్ టిబెట్‌లో అది కూడా భాగమేనని చైనా వాదిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా అరుణాచల్ ప్రదేశ్, తైవాన్‌లను చైనాలో అంతర్భాగంగా చూపించడం లేదన్న అక్కసుతో చైనా కస్టమ్స్ అధికారులు తమ దేశంలో తయారైన 30 వేల ప్రపంచ పటాలను తగులబెట్టేశారు. 
 
భారతదేశం నుంచి ఎవరైనా నాయకులు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినప్పుడెల్లా చైనా తరచూ ఇదే అంశాన్ని లేవనెత్తుతూనే ఉంటుంది. కాగా అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోని అంతర్భాగమేననీ, దీనిపై తమకు శాశ్వత హక్కులు ఉన్నాయని భారత్ స్పష్టం చేస్తూనే వస్తోంది. దీంతో పాటు తరచూ దేశంలోని మిగతా ప్రాంతాలలాగానే అరుణాచల్ ప్రదేశ్‌కి కూడా భారతదేశ నేతలు పర్యటనలు చేస్తూంటారు.
 
కాగా 3,488 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలమధ్య ఇప్పటికి 21 పర్యాయాలు చర్చలు జరిగినప్పటికీ... పెద్దగా సఫలీకృతం కాలేదు. 
 
మరోవైపు ద్వీప దేశం తైవాన్ కూడా తమదేనని డ్రాగన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని ఏదో దేశానికి ఎగుమతి చేయబడేందుకు తరలుతున్న ఈ మ్యాపులను చైనా కస్టమ్స్ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. వీటిలో తైవాన్‌ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారనీ, చైనా-భారత్ సరిహద్దు వివరాలు కూడా 'సరిగాలేవని' చెబుతూ దాదాపు 30 వేలకు పైగా వరల్డ్ మ్యాపులను డ్రాగన్ దేశం తగలబెట్టినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments