చైనాలో కరోనా వైరస్ మ్యత్యుఘోష.. 1662కి చేరిన మరణాలు

Webdunia
ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (10:40 IST)
కరోనా వైరస్ (కోవిడ్-19) మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. దీంతో మృతులు సంఖ్య 1662కు చేరింది. కాగా, కొత్తగా మరో 1843 మందికి ఈ వైరస్ సోకింది.

ఇక, భార‌త దేశ‌ వ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 69 వేలకు చేరింది. అయితే, 9465 మంది ఈ వైర‌స్ బారి నుంచీ బయటపడడం కాస్త ఊరటనిచ్చే అంశం.. కాగా, సింగపూర్‌లో తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకడంతో ఆ దేశంలో ఆ వైర‌స్ బాధితుల సంఖ్య 72కు చేరింది.
 
మరోవైపు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19)‌తో ఐరోపాలోనే తొలిసారిగా ఒకరు ఫ్రాన్స్‌లో చనిపోయారు. ఆసియా వెలుపల మొదటి మరణం కూడా ఇదే. మృతుడు చైనా నుంచి వచ్చిన పర్యాటకుడని, ఆయన వయసు 80 ఏళ్లని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్నెస్ బుజిన్ చెప్పారు. ఈ పర్యటకుడు చైనాలోని హుబే రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఆయన జనవరి 16న ఫ్రాన్స్ చేరుకున్నారని, 25 నుంచి ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచామని మంత్రి వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments