Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 108 కేసులు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:35 IST)
చైనాలో రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. వుహాన్ నగరంలో పుట్టి.. ప్రపంచ దేశాలను అట్టుడికింపజేస్తున్న కరోనా వైరస్.. మళ్లీ చైనాలో విజృంభించడం కలకలం రేపుతోంది. 
 
తద్వారా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుండడంతో అటు ప్రపంచ దేశాలతో పాటు చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది. దీనితో చైనా ప్రభుత్వం మళ్ళీ చర్యలకు సిద్ధమైంది. 
 
వుహాన్ నగరంలో జంతు మాంసం తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెంది నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.... ప్రస్తుతం అటవీ జంతువుల మాంసంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
అయితే చైనాలో నమోదవుతున్న కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయట పడుతున్నాయని అధికారులు తేల్చారు. చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3347 పెరిగింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments