Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా వైరస్.. ఒక్కరోజే 108 కేసులు

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:35 IST)
చైనాలో రోజురోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. వుహాన్ నగరంలో పుట్టి.. ప్రపంచ దేశాలను అట్టుడికింపజేస్తున్న కరోనా వైరస్.. మళ్లీ చైనాలో విజృంభించడం కలకలం రేపుతోంది. 
 
తద్వారా పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుండడంతో అటు ప్రపంచ దేశాలతో పాటు చైనా ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మరోసారి భయాందోళనకు గురిచేస్తుంది. దీనితో చైనా ప్రభుత్వం మళ్ళీ చర్యలకు సిద్ధమైంది. 
 
వుహాన్ నగరంలో జంతు మాంసం తినడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెంది నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.... ప్రస్తుతం అటవీ జంతువుల మాంసంపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. 
 
అయితే చైనాలో నమోదవుతున్న కొత్త కేసులు విదేశాల నుంచి వచ్చిన వారిలోనే బయట పడుతున్నాయని అధికారులు తేల్చారు. చైనాలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి సంఖ్య 3347 పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments