Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మృతి నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (17:22 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మరణం నమోదైంది. ఈ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తూ, లాక్డౌన్‌ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ కోవిడ్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని చైనా అధికారి ప్రకటనలో చెప్పారు. 
 
అలాగే, చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన 87 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మే 26వ తర్వాత చైనాలో కరోనా వైరస్ మరణం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 5,227కి చేరింది. 
 
మరోవైపు, చైనాలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేసినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉండటం గమనార్హం. ఈ దేశంలో ప్రస్తుతం 92 శాతం మంది ప్రజలు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments