Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మృతి నమోదు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (17:22 IST)
కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో ఆరు నెలల తర్వాత కోవిడ్ మరణం నమోదైంది. ఈ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదవుతున్న విషయం తెల్సిందే. దీంతో చైనాలోని పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధిస్తూ, లాక్డౌన్‌ విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలో దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఓ కోవిడ్ మరణం నమోదైంది. ఈ విషయాన్ని చైనా అధికారి ప్రకటనలో చెప్పారు. 
 
అలాగే, చైనా రాజధాని బీజింగ్‌కు చెందిన 87 యేళ్ల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. మే 26వ తర్వాత చైనాలో కరోనా వైరస్ మరణం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ తాజా మరణంతో చైనాలో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 5,227కి చేరింది. 
 
మరోవైపు, చైనాలో ప్రజలకు వ్యాక్సినేషన్ వేసినప్పటికీ కొత్త కేసులు నమోదవుతూనే ఉండటం గమనార్హం. ఈ దేశంలో ప్రస్తుతం 92 శాతం మంది ప్రజలు సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను వేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

తర్వాతి కథనం
Show comments