Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజమే... గాల్వాన్ ఘటనల 45 మంది చనిపోయారు : చైనా ప్రకటన

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (11:54 IST)
గత యేడాది జూన్ నెలలో సరిహద్దుల్లోని గాల్వన్ లోయ వద్ద భారత్‌తో జరిగిన ఘర్షణలో తమ దేశానికి చెందిన 45 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు చైనా తొలిసారి ప్రకటించింది. నిజానికి ఈ ఘర్షణలో భారత సైనికులు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే, చైనా వైపు నుంచి మృతుల‌/గాయ‌ప‌డిన వారి సంఖ్య 35 ఉంటుంద‌ని అప్ప‌ట్లో భార‌త్ ప్ర‌క‌టించింది. 
 
కానీ, ఆ సంఖ్యను చైనా నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌లో చైనా సైనికులు 45 మంది మృతి చెందార‌ని ఇటీవ‌ల ర‌ష్యా మీడియా కూడా  ప్ర‌క‌టించింది. అయితే, తమ సైనికులు చనిపోలేదని ఇన్ని నెల‌లూ చెప్పుకుంటూ వ‌చ్చిన వ‌చ్చిన చైనా చివ‌ర‌కు చేసేది ఏమీ లేక మృతుల సంఖ్య‌ను ప్ర‌క‌టించింది.
 
అయితే, త‌మ సైనికులు ఐదుగురు మాత్ర‌మే చ‌నిపోయార‌ని చెప్పుకొచ్చింది. అంతేగాక‌, వారికి అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వారి పేర్లను కూడా చైనా విడుదల చేసింది. జిన్‌జియాంగ్ మిలిటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంటర్ కమాండర్ క్వి ఫాబావోతో పాటు క్విఫాబావో, చెన్ హాంగ్‌జున్, చెన్ జియాంగ్ ‌రాంగ్, జియావో సియువాన్, వాంగ్ జువారన్ అనే సైనికులు చ‌నిపోయిన‌ట్లు చెప్పింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments