Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షీణించిన భారత్ - చైనా స్నేహం... ఏ క్షణమైనా యుద్ధం : ఫారిన్ మీడియా

భారత్, చైనా దేశాల మధ్య స్నేహసంబంధాలు గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిపోయాయని, అందువల్ల ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడుతోంది.

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (14:06 IST)
భారత్, చైనా దేశాల మధ్య స్నేహసంబంధాలు గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా క్షీణించిపోయాయని, అందువల్ల ఇరు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడుతోంది. 
 
సిక్కిం రాష్ట్రంలోని డోక్లామ్ రీజియన్‌ వద్ద భారత భూభాగంలో చైనా రోడ్డు నిర్మాణం చేపట్టగా, ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా అడ్డుకుంది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులపై విదేశీ మీడియా 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఇండియా, చైనాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ రెండు దేశాల మధ్యా ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. గడచిన రెండు నెలలుగా హిమాలయాల ప్రాంతంలోని డోక్లామ్ రీజియన్ లో ఇరు దేశాలూ సైన్యాన్ని మోహరించాయని, ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసేందుకు ఇప్పటివరకూ చర్చలు ప్రారంభం కాలేదని, సమస్యకు కారణం మీరంటే మీరని రెండు దేశాలూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నాయని 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
ఈ ప్రాంతం తమదంటే, తమదని రెండు దేశాలూ వాదిస్తున్న విషయాన్నీ ప్రస్తావించింది. వెనక్కు తగ్గేందుకు ఏ దేశమూ సుముఖంగా లేదని, ఏక్షణమైనా సైనికుల మధ్య కాల్పులతో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. భారత్, చైనాల మధ్య స్నేహబంధం, గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు 'ది వాషింగ్టన్ పోస్టు' పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments