అప్పుడు పాకిస్థాన్.. ఇప్పుడు చైనా హెలికాఫ్టర్.. భారత గగనతలంలో..?

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:38 IST)
పాకిస్థాన్‌కు చెందిన హెలికాఫ్టర్ భారత గగనతలంలోకి ప్రవేశించింది. గమనించిన భారత వైమానిక దళం కాల్పులు జరపపడంతో ఆ హెలికాఫ్టర్ తోకముడిచి పారిపోయింది. తాజాగా.. చైనాకు చెందిన రెండు హెలికాఫ్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించడమే కాకుండా ఏకంగా పది నిమిషాల పాటు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. భారత గగనతలాన్ని శత్రుదేశాలు తరచూ ఉల్లంఘించడం ద్వారా కేంద్రం తలపట్టుకుని కూర్చుంది. 
 
కాగా సెప్టెంబర్ 27వ తేదీన లడఖ్‌లోని ట్రిగ్ హైట్స్ వద్ద చైనా హెలికాప్టర్లు కనిపించాయి. ఏకంగా పదినిమిషాల పాటు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టిన అనంతరం వెనుదిరిగాయి. ఇప్పుడీ విషయం బయటపడింది. దీనిపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. భారత గగనతలాన్ని శత్రుదేశాలు పదేపదే ఉల్లంఘిస్తున్నా భారత్ ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయిందని విపక్షాలు మండిపడుతున్నాయి. 
 
గగనతల అతిక్రమణలకు అడ్డుకట్టవేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా.. కళ్లు తెరిచి కఠిన చర్యలు చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments