Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండోనేషియాలో సునామీ, భూకంపం- మసీదు నీట మునిగింది... 30 మంది మృతి

ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందంగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా, శు

ఇండోనేషియాలో సునామీ, భూకంపం- మసీదు నీట మునిగింది... 30 మంది మృతి
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (10:18 IST)
ఇండోనేషియాలో సునామీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. భూకంప తీవ్రత 7.5గా రిక్టారు స్కేలుపై నమోదైంది. భూకంపం కారణంగా ఇద్దరు మృతి చెందంగా, భారీ ఆస్తి నష్టం జరిగింది. కాగా, శుక్రవారం రాత్రి సమయంలో సునామీ ఇండోనేషియా తీరాన్ని తాకి బీభత్సం సృష్టించింది.
 
భారీ అలలు దూసుకురావడంతో తీరం వెంబడి ఉన్న నివాసాలు చాలా వరకు ధ్వంసం అయ్యాయి. దీంతో, ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పౌలు నగరంలోని ప్రజలను రక్షించేందుకు అధికారులు సహాయక బృందాలను పంపించినట్లు ఇండోనేషియా మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సునామీ, భూకంపం కారణంగా 300,000 మంది నిరాశ్రయులైనారు. భీకర అలలు ఎత్తైన భవనాలను తాకడం, పౌలు నగరంలోని అతిపెద్ద మసీదు కూడా సునామీ అలల తాకిడికి గురికావడానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కాగా.. 2004 తర్వాత ఇండోనేషియా దీవుల్లో సునామీ రావడం ఇదే తొలిసారి. అప్పట్లో సంభవించిన సునామీ కారణంగా దాదాపు 2,20,000 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 1,68,000 మంది ఇండోనేషియా వాసులే ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియా అంత సేఫ్టీ కాదనేందుకు ఇదో ఉదాహరణ..