Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రరాజ్యం కాల్పుల కలకలం.. వృద్ధురాలు, ఏడాది పిల్లాడి మృతి

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (17:02 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. గురువారం రోజు తూట పేలడంతో ఓ మహిళతోపాటు ఏడాది బాబు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని రాయల్ పామ్ బీచ్‌లో ఉన్న పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌లో గురువారం రోజు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో వృద్ధ మహిళ సహా ఏడాది వయసున్న ఆమె మనవడు తీవ్రంగా గాయపడ్డి ప్రాణాలు కోల్పోయారు. 
 
అనంతరం కాల్పులకు పాల్పడ్డ సదరు దుండగుడు సైతం తనను తాను కాల్చుకుని మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 
 
అంతేకాకుండా దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లోరిడాలో గత ఆదివారం కూడా ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డ సంగతి తెలిసిందే. మియామిలోని జరిగే గ్రాడ్యూయేషన్ పార్టీలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ముగ్గరు మరణించగా.. ఐదుగురు గాయపడిన సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments