Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎంసీ గూటికి ముకుల్ రాయ్... మమత సమక్షంలో చేరిక

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (17:00 IST)
ప‌శ్చిమ బెంగాల్‌లో భార‌తీయ జ‌నతా పార్టీకి తేరుకోలని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయ‌కుడు ముకుల్ రాయ్ తిరిగి తృణ‌మూల్ కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. ఆయన శుక్రవారం మ‌ధ్యాహ్నం ముకుల్ రాయ్‌ తన కుమారుడు సుభ్రంగ్సు రాయ్‌తో కలిసి టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత్ బెనర్జీ సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. ఈ స‌మావేశంలో మ‌మ‌త మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ కూడా హాజ‌రయ్యారు. ఆయననే ముకుల్ రాయ్, ఆయన కుమారుడుకి టీఎంసీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, బీజేపీ గురువారం నిర్వ‌హించిన స‌మావేశానికి ముకుల్ రాయ్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నట్టు ప్రచారం జరిగింది. 
 
గత 2017లో టీఎంసీని వీడిన ముకుల్ రాయ్ బీజేపీలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్య‌క్షునిగా సేవ‌లందించారు. అయితే, ఎందుకో ఆయన కమలనాథులతో కలిసి పయనించలేక తిరిగి సొంతగూటికే చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments