కరోనాతో తండ్రి బాధపడితే.. అన్నం పెట్టే వాడు లేడు.. పిల్లాడు మృతి

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (12:39 IST)
చైనా ప్రభుత్వం కరోనాపై పోరాటం చేస్తోంది. తమ పౌరుల ప్రాణాలను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 20వేల మందికి పైగా సోకిన నేపథ్యంలో చైనా సర్కారు కఠిన ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమైంది. కరోనా వైరస్ దెబ్బకు మృతుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

ఇప్పటికే కరోనా మృతుల సంఖ్య 400కి దాటింది. తాజాగా చైనాలో ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌కు చెందిన యాంగె చెంగ్‌.. వయసు 16 ఏళ్లు. అంటే తన కాళ్ళ మీద తాను బ్రతికే పరిస్థితి లేదు.
 
అతడు సెరిబ్రల్‌ పాల్సీ బాధితుడు. ఆ బాలుడి తండ్రి కరోనా వైరస్‌ బారిన పడ్డాడనే అనుమానంతో స్థానిక అధికారులు అతణ్ని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ పిల్లాడికి అన్నం పెట్టేవాడు లేకపోయాడు. దీనితో ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ బాలుడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను చైనా ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments