Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం స్వదేశానికి అభినందన్.. శాంతిని కోరుకుంటున్నాం.. అందుకే?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:56 IST)
ప్రాణాలకు తెగించి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని తరిమికొట్టే క్రమంలో నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ విషయంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.


ఏది ఏమైనా తమ కమాండర్‌ను సురక్షితంగా అప్పగించాలని ఈ విషయంలో ఎటువంటి డీల్‌లకు కానీ ప్రలోభాలకు కానీ తలొగ్గేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో తమకు బంధీగా చిక్కిన భారత కమాండర్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని ఇందుకు సూచనగానే అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ చర్యను భారత్ పాక్‌ల మధ్య చర్చలకు మొదటి అడుగుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
 
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు తనకు అందాయని, ఈ నేపథ్యంలో తాను నరేంద్ర మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అభినందన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments