శుక్రవారం స్వదేశానికి అభినందన్.. శాంతిని కోరుకుంటున్నాం.. అందుకే?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:56 IST)
ప్రాణాలకు తెగించి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని తరిమికొట్టే క్రమంలో నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ విషయంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.


ఏది ఏమైనా తమ కమాండర్‌ను సురక్షితంగా అప్పగించాలని ఈ విషయంలో ఎటువంటి డీల్‌లకు కానీ ప్రలోభాలకు కానీ తలొగ్గేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో తమకు బంధీగా చిక్కిన భారత కమాండర్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని ఇందుకు సూచనగానే అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ చర్యను భారత్ పాక్‌ల మధ్య చర్చలకు మొదటి అడుగుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
 
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు తనకు అందాయని, ఈ నేపథ్యంలో తాను నరేంద్ర మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అభినందన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Actress Sobhita: తమిళ సినిమా కోసం సంతకం చేసిన శోభిత దూళిపాళ

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

తర్వాతి కథనం
Show comments