Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం స్వదేశానికి అభినందన్.. శాంతిని కోరుకుంటున్నాం.. అందుకే?

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:56 IST)
ప్రాణాలకు తెగించి పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని తరిమికొట్టే క్రమంలో నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌కు చిక్కిన మన వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయాలని దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఈ విషయంగా భారత ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేసింది.


ఏది ఏమైనా తమ కమాండర్‌ను సురక్షితంగా అప్పగించాలని ఈ విషయంలో ఎటువంటి డీల్‌లకు కానీ ప్రలోభాలకు కానీ తలొగ్గేది లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
 
ఈ నేపథ్యంలో తమకు బంధీగా చిక్కిన భారత కమాండర్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయబోతున్నట్లు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంటులో ప్రకటించారు. తాము శాంతిని కోరుకుంటున్నామని ఇందుకు సూచనగానే అతడిని విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఈ చర్యను భారత్ పాక్‌ల మధ్య చర్చలకు మొదటి అడుగుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
 
పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ డిప్యూటీ హైకమీషనర్‌కు భారత్ అందజేసిన సాక్ష్యాధారాలు తనకు అందాయని, ఈ నేపథ్యంలో తాను నరేంద్ర మోదీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అభినందన్‌ను శుక్రవారం సాయంత్రంలోగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments