Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కోల్పోయి పక్షం రోజులు.. మరిదిని పెళ్లాడాలని వీర జవాను భార్యకు వేధింపులు

Webdunia
గురువారం, 28 ఫిబ్రవరి 2019 (17:44 IST)
పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న వీర జవాన్ భార్య. చెప్పుకోవడానికి సగర్వంగా ఉన్నా, ఆమె దీనగాథ వింటే మనకు మనసు చలించిపోతుంది. కొద్ది రోజుల క్రితమే భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెకు అత్తారింటి వేధింపులు తప్పలేదు. ఈ విషయంలో అమరవీరుల కుటుంబానికి కూడా మినహాయింపు లేదనిపిస్తోంది. డబ్బులు కోసం మరిదిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
రాష్ట్రంలోని మాండ్వా ప్రాంతానికి చెందిన హెచ్ గురు పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పక్షం రోజులు కూడా గడవక ముందే అతని భార్య కళావతిపై అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ఎక్కడ దక్కకుండా పోతాయో అనే దురుద్దేశంతో మరిది వరుసయ్యే భర్త తమ్ముడికి ఇచ్చి కట్టబెట్టాలని చూస్తున్నారు. 
 
అయితే చనిపోయిన వీర జవానుకు భార్యగా ఆమె చేసిన సెల్యూట్ చూసి యావత్ భారతదేశం నివ్వెరపోయింది. ఆమె కుటుంబానికి నటి సుమలత అర ఎకరం బహుమానంగా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీర జవాన్ల కుటుంబాలకు అనేక ఆర్థిక సహాయాలు అందించాయి. ఈ నేపథ్యంలో 15 రోజులు కూడా గడవక ముందే వారు ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో మాండ్వా పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments