Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశం మాలిలో ఘోర : 41 మంది మృత్యువాత

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (08:32 IST)
ఆఫ్రికా దేశాల్లో ఒకటైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్‌ పేలడంతో డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. 
 
ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి. ఏటా అక్కడి దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు రోడ్డు ప్రమాదాల్లోనే 26 మంది చనిపోతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments