Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల కోసం ఉగ్రవాదులను వదిలిపెట్టిన నైజీరియా

బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది

Webdunia
ఆదివారం, 7 మే 2017 (14:34 IST)
బోకోహరామ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన పాఠశాల విద్యార్థినులను విడుదల చేసేందుకు నైజీరియా ప్రభుత్వం పలువురు కరుడుగట్టిన ఉగ్రవాదులకు స్వేచ్ఛ కల్పించింది. దీంతో బోకోహరామ్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన 200 మంది పాఠశాల విద్యార్థినుల్లో 82 మంది విడిచిపెట్టారు. మిగిలిన వారిని కూడా విడిపించేందుకు నైజీరియా సర్కారు చర్యలు చేపట్టింది. 
 
దాదాపు మూడేళ్ల క్రితం చిబుక్‌లోని పాఠశాలపై దాడి చేసిన బోకోహరామ్ ఉగ్రవాదులు 200 మందికి పైగా అమ్మాయిలను అపహరించుకుపోగా, ఆపై అంతర్జాతీయ మధ్యవర్తుల సహకారంతో 21 మందిని విడిచిపెట్టగా, ఇపుడు మరో 82 మందిని వదిలిపెట్టారు. ఆపై ఉగ్రవాదులతో నైజీరియా ప్రభుత్వం నెలల తరబడి చర్చలు జరిపింది. తాము జరిపిన చర్చలు ఇప్పటికి ఫలవంతం అయ్యాయని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
 
తమ సెక్యూరిటీ అధికారులకు ఉగ్రవాదులు అమ్మాయిలను అప్పగించారని తెలిపారు. వీరిని అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ స్వయంగా కలుస్తారని తెలిపారు. వీరందరూ ప్రస్తుతం సైన్యం అధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. బందీలుగా ఉన్న మిగతా వారిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. కాగా, తాము విడిచిపెట్టిన ఉగ్రవాదుల వివరాలను మాత్రం నైజీరియా ప్రభుత్వం వెల్లడించలేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం