Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యాలో కొత్త పురుగు, రక్తం తాగుతోందట

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (18:12 IST)
పేల లాంటి పురుగులతో రష్యా కొత్త సమస్య ఎదుర్కొంటోంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా కకలావికలం అవుతుంటే, మరో ముప్పు ఆ దేశాన్ని పీడించడానికి తయారైంది. ఈ పురుగులు రక్తాన్ని పీలుస్తూ వేలాది మందిని ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. కోవిడ్ రోగులతో హాస్పిటళ్లు నిండిపోతుంటే, ఈ సమస్య మరో తలనొప్పిగా మారింది.
 
మరో విషయం గమనించాల్సిందేమంటే వీటి వలన వచ్చే రోగాలకు మునుపు నుండి ఇస్తున్న వ్యాక్సిన్‌లు ఇప్పుడు పనిచేయడం లేదట. వైరస్ జన్యు నిర్మాణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఇప్పటికే ఉండే వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ దాడి రష్యాలో కొత్త కాకపోయినప్పటికీ ప్రస్తుతం గుంపులు గుంపులు వచ్చి ప్రజల మీద దాడి చేస్తున్నాయి.
 
జన్యు మార్పుల వల్ల కొత్త రోగాలను కూడా ఇవి సృష్టించడం మొదలుపెట్టాయి. చిన్నారులపై వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పేల లాగే ఉన్నా ఆకారంలో కొద్దిగా పెద్దవిగా ఉన్నాయి. సాధారణంగా ఇవి జంతువులలో ఎక్కువగా కనిపిస్తాయి.
 
గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. ఆలాంటి ప్రాంతాల్లో సంచరించే వారికి ముప్పు తప్పడం లేదు. మునుపటి కంటే వీటి ఉత్పత్తి 428 రెట్లు పెరిగిందని అధికారులు వెల్లడించారు. వీటి దాడిని తేలికగా తీసుకోవద్దని, బ్రెయిన్, కీళ్లు, గుండె దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments