Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారం ధరలు తగ్గాయి, ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (18:01 IST)
ప్రపంచ ప్రభుత్వాల ప్రధాన ఆందోళన ఏమిటంటే లాక్డౌన్ చర్యలను ఎలా తొలగించాలి? వారి పౌరులను రక్షించడానికి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ఎలా పెంచుకోవాలి? అనే అంశాలే. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ ఆశలు కొనసాగాయి, కాని మహమ్మారి రెండవ పునరుత్థాన తరంగం గురించిన భయాలు ప్రపంచ నాయకుల మనస్సులో ఇంకా కొనసాగుతున్నాయి. ఈ బంగారం, వెండి తదితర లోహాల ధరలు ఎలా వున్నాయో చూద్దాం.
 
బంగారం
స్పాట్ బంగారం ధరలు 0.74 శాతం తగ్గి 1727.0 డాలర్లకు చేరుకున్నాయి. ఎందుకంటే అనేక వ్యాపారాలు, ఇతర ఆస్తులకు పెరుగుతున్న డిమాండ్ పసుపు లోహం ధరను తగ్గించింది. అనేక దేశాలు లాక్ డౌన్ చర్యలను తొలగించి, వేగంగా ఆర్థిక పునరుద్ధరణ కోసం ప్రణాళికలను రూపొందించడంతో పసిడి ధరలు తగ్గాయి.
 
జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల అదుపులో మరణించిన తరువాత అమెరికాలో విస్తృతమైన అల్లర్లు చెలరేగాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను పారద్రోలేందుకు కఠినమైన పటాలాన్ని, సైన్యాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించారు. ఇంకా, యుఎస్ - చైనా మధ్య ఉద్రిక్తతలు మార్కెట్ మనోభావాలపై భారం మోపి, బంగారం ధరల పతనానికి కారణమయ్యాయి.
 
వెండి
మంగళవారం రోజున, స్పాట్ వెండి ధరలు 0.99 శాతం తగ్గి ఔన్సుకు 18.1 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు3 శాతానికి పైగా తగ్గి కిలోకు రూ. 49,080 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
మంగళవారం రోజున, డబ్ల్యుటిఐ ముడిచమురు ధరలు 3.87 శాతం పెరిగి బ్యారెల్ కు 36.8 డాలర్లకు చేరుకున్నాయి. ఒపెక్ మరియు రష్యా నివేదికలు తరువాతి నెలల్లో దూకుడు ఉత్పత్తి కోతలు కొనసాగవచ్చని సూచించాయి. వాయు, రోడ్డు రహదారి ట్రాఫిక్ పునఃప్రారంభం, అనేక చోట్ల కర్మాగారాలు, ఉత్పత్తి యూనిట్లు తిరిగి తెరవడంతో పాటు ధరలు పెరిగాయి.
 
అయినప్పటికీ, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయడం గురించి ఆందోళనలను కొనసాగించాయి. ఒకవేళ ఈ రద్దు జరిగితే, ముడి చమురు డిమాండ్ తగ్గిపోతుంది.
 
మూల లోహాలు
మంగళవారం రోజున, చైనాలో పారిశ్రామిక కార్యకలాపాలను పునఃప్రారంభించడం వల్ల లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్‌ఎంఇ)పై బేస్ మెటల్ ధరలు సానుకూలంగా ముగిశాయి.
 
అయినప్పటికీ, పారిశ్రామిక లోహాలలో సుదీర్ఘ స్థానాలు తీసుకోవడానికి హెడ్జ్ ఫండ్లు ఇప్పటికీ ఇష్టపడవు. ఈ అంశం మార్కెట్లను జాగ్రత్త పడేటట్లు చేసింది. మహమ్మారికి కారణమైనందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాపై నిందలు వేస్తూనే ఉండడంతో యుఎస్-చైనా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. నివేదికల ప్రకారం, యు.ఎస్. వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున చేసే కొనుగోళ్లను చైనా నిలిపివేసింది. ఫలితంగా ఏర్పడే గట్టి వాణిజ్య యుద్ధం మూల లోహాల పెరుగుదలను పరిమితం చేస్తుంది.
 
అంతేకాకుండా, యు.ఎస్‌లో పెరిగిన నిరసనలు, దోపిడీలు, హింసలు మార్కెట్ మనోభావాలపై భారం మోపాయి. మూల లోహాల ధరలో ఏవైనా పెరుగుదలను పరిమితం చేసాయి.
 
రాగి
మంగళవారం రోజున, ఎల్‌ఎంఇ కాపర్ 0.81 శాతం పెరిగి టన్నుకు 5528.5 డాలర్లకు చేరుకుంది. మహమ్మారి అనంతరం, చైనా ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణ అవుతుందనే ఆశలు రెడ్ మెటల్ ధరలకు మద్దతు ఇచ్చాయి.
 
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మాంద్యం లాంటి పరిస్థితుల కారణంగా నిరుద్యోగం, ఆకలితో అలమటించడం వంటి క్లిష్టమైన సమస్యలను ప్రపంచ ప్రభుత్వాలు ఎలా పరిష్కరించగలవో చూడాలి. లాక్ డౌన్ల తొలగింపుతో, ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని భావించబడుతోంది.
 
- ప్రథమేష్ మాల్యా, ఛీఫ్ అనలిస్ట్,నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments