Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిగ్రీ పట్టా కోసం 8 మంది డూప్‌లు.. ఎంపీని సస్పెండ్ చేసిన వర్శిటీ!

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (14:56 IST)
బంగ్లాదేశ్ ఎంపీ చిక్కుల్లో పడ్డారు. డిగ్రీ పట్టా పుచ్చుకునేందుకు ఏకంగా ఎనిమిది మంది డూప్‌లను సిద్ధం చేసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ ఎంపీని విశ్వవిద్యాలయం బహిష్కరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంగ్లాదేశ్‌ అధికార పార్టీకి చెందిన ఎంపీ తమన్నా సుస్రత్, యూనివర్సిటీ పరీక్షలను తన తరపున రాయించేందుకు తనలాగే కనిపించే 8 మంది డూప్‌లను తయారు చేయించారు. వారితోనే పరీక్షలు రాయించారు. ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా, సాక్ష్యాలతో సహా మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టడంతో యూనివర్సిటీ యాజమాన్యం సుస్రత్‌ను బహిష్కరించింది. 
 
కాగా, అవామీ లీగ్‌ పార్టీకి చెందిన తమన్నా నుస్రత్‌ బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ విద్యను అభ్యసిస్తున్నారు. తాను రాయాల్సిన మొత్తం 13 సబ్జెకుల పరీక్షల కోసం తన మాదిరిగానే ఉన్న 8 మందిని ఆమె రంగంలోకి దించగా, నాగరిక్‌ టీవీ అనే చానెల్‌ విషయాన్ని బయటపెట్టింది. ఈ డూప్ మహిళలు పరీక్షలు రాస్తుంటే, ఎంపీ అనుచరులు కాపలాగా ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments