బంగ్లాదేశ్‌‍లో హింస - 100 మంది మృతి.. ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా!!

వరుణ్
సోమవారం, 5 ఆగస్టు 2024 (17:18 IST)
పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. ఇందులో దాదాపు వంద మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా ఆదివారం జరిగిన ఘర్షణల్లో వీరంతా చనిపోయారు. కాగా, ఆ దేశంలో ఇప్పటివరకు జరిగిన హింసాత్మక ఘటననల్లో సుమారుగా 300 మంది చనిపోయారు. దీంతో ఆ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుజాగ్రత్త చర్యగా ఢాకా ప్యాలెస్‌ను వీడిన ప్రధానమంత్రి షేక్‌ హసీనా.. సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో పీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి వెళ్లారు. ఈ విషయాన్ని సైన్యం ధ్రువీకరించింది.
 
దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రధాని హసీనా, ఆమె సోదరి రెహానాలు రాజధాని ఢాకా నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లో దేశం విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే, వాళ్లు ఎక్కడికి వెళ్లారనే విషయంపై స్పష్టత లేదు. భారత్‌ వెళ్లి ఉండొచ్చని పలు మీడియా సంస్థలు చెబుతుండగా.. మరికొన్ని మాత్రం వేరే దేశం వెళ్లనున్నట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ప్రధానమంత్రి అధికారిక నివాసమైన గణభాబన్‌ను ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు.. అక్కడ విధ్వంసం సృష్టించారు.
 
ఇదిలావుంటే, హింసాత్మక ఘటనలతో దేశం అట్టుడుకుతోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ వాకర్‌-ఉజ్‌-జమాన్‌ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. నిరసనకారులు హింసామార్గాన్ని వీడాలని పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటన నేపథ్యంలో త్వరలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rukmini Vasanth: కాంతారా హీరోయిన్‌కు టాలీవుడ్ ఆఫర్లు.. ఎన్టీఆర్ డ్రాగన్‌లో సంతకం చేసిందా?

అది నా రెండో ఇళ్లు.. అక్కడికి వెళ్తే ప్రశాంతంగా వుంటాను.. ఆ కొటేషన్ నన్ను మార్చేసింది..

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments