Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:48 IST)
సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబిడ్డ గొంతులో ఉప్పు పోసి చంపేసింది. ఈ దారుణం బంగ్లాదేశ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ బిచ్చు, సాతీ అనే దంపతులకు మూడేళ్ళ రెండేళ్ళ బాలుడు ఉన్నాడు. ఈ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిచ్చు ఇటీవల పని మానేసి ఇంట్లో కూర్చోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు సాతీ డబ్బు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టేసి చల్లగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని చెబుతూ పిడికిలి నిండా ఉప్పును చిన్నారి గొంతులో పోసేసింది. ఆ పని చేసిన కొద్దిసేపటికే చేసిన తప్పు తెలుసుకుంది. వెంటనే పిల్లాడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చారు. కాగా, ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో సాతీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments