Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసికందు గొంతులో ఉప్పుపోసి చంపేసిన తల్లి.. ఎందుకో తెలుసా?

సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబ

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:48 IST)
సాధారణంగా కన్నబిడ్డ ఏడిస్తే కన్నతల్లి తట్టుకోలేదు. తిరిగి ఆ బిడ్డ నవ్వేంత వరకు ఆ తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కానీ, ఈ కసాయి మహిళ మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్నబిడ్డ గొంతులో ఉప్పు పోసి చంపేసింది. ఈ దారుణం బంగ్లాదేశ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహ్మద్ బిచ్చు, సాతీ అనే దంపతులకు మూడేళ్ళ రెండేళ్ళ బాలుడు ఉన్నాడు. ఈ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిచ్చు ఇటీవల పని మానేసి ఇంట్లో కూర్చోవడంతో పూట గడవటం కష్టంగా మారింది. దీంతో ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
ఈ నేపథ్యంలో పిల్లాడికి పాలు తీసుకురావాలని భర్తకు సాతీ డబ్బు ఇచ్చింది. కానీ అతను ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టేసి చల్లగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. పిల్లాడు ఆకలితో అలమటించడం కంటే చావడం నయమని చెబుతూ పిడికిలి నిండా ఉప్పును చిన్నారి గొంతులో పోసేసింది. ఆ పని చేసిన కొద్దిసేపటికే చేసిన తప్పు తెలుసుకుంది. వెంటనే పిల్లాడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు తేల్చారు. కాగా, ఈ ఘటనపై భర్త ఫిర్యాదుతో సాతీని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments