Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా జర్నలిస్టును చంపేశారు.. ఎందుకంటే...

బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (08:31 IST)
బంగ్లాదేశ్‌లో ఓ మహిళా జర్నలిస్టును చంపేశారు. అదీ ఆమె ఇంట్లోనే పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ హత్య వెనుక ఆమె భర్త ఉన్నట్టు పోలీసులు సందేహిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
 
బంగ్లాదేశ్‌కు చెందిన సుబర్నా అఖ్తర్ నోడి (32) అనే మహిళ జర్నలిస్టుగా పని చేస్తోంది. ఈమె ఆనంద అనే ప్రైవేట్ న్యూస్ చానెల్‌తోపాటు జాగ్రోతో బంగ్లా అనే దినపత్రిక కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తన 9 యేళ్ళ కుమార్తెతో కలిసి పాబ్నా జిల్లా రాధానగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. 
 
ఈ క్రమంలో మంగళవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో 12 మంది దుండగులు ఆమె ఇంటికొచ్చి బెల్ కొట్టారు. డోర్ తీసిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి లోపలికి వెళ్లేందుకు వెనుదిరిగింది. అంతే.. ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో దుండగులు ఆమెపై దాడి చేశారు. 
 
ఆ తర్వాత ద్విచక్రవాహనాలపై పారిపోయారు. రక్తమడుగులో ఉన్న సుబర్నాను స్థానికులు దవాఖానకు తరలించగా, అప్పటికే ఆమె చనిపోయింది. కాగా, సుబర్నా హత్య వెనుక భర్త రజిబ్ హుస్సేన్, మామ అబ్దుల్ హుస్సేన్ హస్తం ఉందని మృతురాలి బంధువులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments