Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్వాటెమాలో లోయలోపడిన బస్సు - 55 మంది మృతి

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (09:40 IST)
మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలా శివారు శివారుల్లో ఓ బస్సు వంతెన పైనుంచి లోయలోపడిపోయింది. ఈ ఘటనలో 55 మంది మృత్యువాతపడ్డారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రోగ్రెసో అనే ప్రాంతం నుంచి గ్వాటెమాలా నగరానికి వెళుతుండగా ఓ వంతెనపై పలు వాహనాలు ఢీకొనడేంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అగ్నిమాపకదళ శాఖ అధికారి ఎడ్విన్ విల్లాగ్రాన్ తెలిపారు. బస్సు 115 అడుగుల లోతులో మురుగునీటి ప్రవాహంలో పడిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ఆ దేశ అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలిపారు. 

భర్తతో విడిపోయింది.. అక్రమ సంబంధం పెట్టుకుంది.. సుపారీ ఇచ్చి హత్య చేయించారు...
 
మనస్పర్థల కారణంగా కట్టుకున్న భర్తతో విడిపోయిన ఓ మహిళ.. ఆ తర్వాత పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసిన భర్త కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేయించారు. ఇందుకోసం భారీ మొత్తాన్ని సుపారీ రూపంలో ఖర్చు చేశారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడ మమత అనే మహిళ తన భర్త భర్తతో మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయి, మంచిర్యాలలో ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సింగరేణిలో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ విషయాన్ని భర్త భాస్కర్సోదరి నర్మదకు తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడు రఘుతో కలిసి మమత హత్యకు ప్లాన్ వేసింది. సుపారీ హంతకుడు వేల్పుల కళ్యాణ్‌కు రూ.5 లక్షల వరకు డబ్బులు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత మమతను హత్య చేసిన తర్వాత కళ్యాణ్‌కు నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగంలు హంతకుడుకి ఒప్పందం మేరకు డబ్బులు చెల్లించారు.
 
అయితే, హత్య తర్వాత మమత మృతదేహాన్ని తీసుకెళ్లి, జిల్లాలోని గంగాధర మండలం, కొండన్నపల్లి శివారు ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత కళ్యాణ్ చెన్నైకు పారిపోయారు. దీనిపై మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కళ్యాణ్ కోసం గాలిస్తున్నారు. ఈ హత్యకు ప్లాన్ చేసిన నర్మద, ఆమె ప్రియుడు రఘు, నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగులను ఇంటివద్దే అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments