Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (16:07 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. ఆప్ఘన్, తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తాలిబన్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రంజాన్ ను పురస్కరించుకుని ఉపవాస దీక్షల అనంతరం పలువురు లోగర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుకుంటున్నారు. 
 
శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై కారు బాంబు పేలింది. 
 
ఈ ధాటికి గెస్ట్‌హైస్ కుప్పకూలిపోయి 30 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్నీ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments