Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు.. కారు బాంబు పేలి 30మంది మృతి

Webdunia
శనివారం, 1 మే 2021 (16:07 IST)
ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రమూకలు విజృంభించారు. ఆప్ఘన్, తూర్పు లోగర్ ప్రావిన్స్‌లో శుక్రవారం రాత్రి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. వందమందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో విద్యార్థులు అధికంగా ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తాలిబన్లు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. రంజాన్ ను పురస్కరించుకుని ఉపవాస దీక్షల అనంతరం పలువురు లోగర్ ప్రావిన్స్‌లోని ఓ ఇల్లును గెస్ట్‌హౌస్‌గా వాడుకుంటున్నారు. 
 
శుక్రవారం రాత్రి ప్రార్థనల అనంతరం ఉపవాసం విడిచిన వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గెస్ట్ హౌస్‌కు ఆనుకుని ఉన్న రోడ్డుపై కారు బాంబు పేలింది. 
 
ఈ ధాటికి గెస్ట్‌హైస్ కుప్పకూలిపోయి 30 మంది ఘటనాస్థలిలోనే చనిపోయారు. సుమారు 100 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి , అన్నీ కోణాల్లో విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments