Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటలీలో పెను విషాదం... శరణార్థుల పడవ మునిగి 27 మంది మృతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (16:46 IST)
ఇటలీ దేశంలో పెను విషాదం సంభవించింది. శరణార్థులతో వస్తున్న పడవ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. దీంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ శరణార్థులంతా ఇరాన్, పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ దేశాలకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఓ పసికందు కూడా ఉంది. చనిపోయిన వారి మృతదేహాలు ఓ గ్రామంలోని తీరానికి కొట్టుకుని వచ్చాయి. దీంతో అక్కడ పెను విషాదం నెలకొంది. 
 
తమ సొంత దేశంలో జీవించలేక, స్థానికంగా నెలకొన్న భయానక పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు శరణార్ధులుగా అనేక మంది అక్రమ మార్గంలో వెళుతూ ఇలా సముద్ర ప్రమాదాలకు గురవున్నారు. 
 
తాజాగా, ఇటలీ తీరంలో శరణార్థులతో వస్తున్న పడవ మునిగిపోవడంతో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతిచెందిన వారిలో ఓ పసికందు కూడా ఉండడం స్థానిక అధికారులను కలచివేసింది. ఈ పడవలో 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. 
 
వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి. అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments